జీఎస్టీ చట్టాన్ని కేంద్రం ఉల్లంఘించిందని తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారరం తగ్గించాలన్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీకి మంగళవారం లేఖ రాశారు చంద్రశేఖర్ రావు. రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం పూర్తిగా చెల్లించాలని ప్రధాని మోదీని విజ్ఞప్తి చేశారు. కేంద్రమే రుణం తీసుకొని రాష్ట్రాలకు పూర్తి పరిహారం చెల్లించాలని కోరారు. చట్టం ప్రకారం 14 శాతం వృద్ధి రేటు ఆధారంగా రాష్ట్రాలకు ఆదాయం తగ్గితే.. కేంద్రమే పరిహారం చెల్లించాలని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.
0 Comments