అభిమానుల మృతిపై స్పందించిన పవన్ కల్యాణ్.. వారికి ఇక నేనే బిడ్డను

అభిమానుల మృతిపై స్పందించిన పవన్ కల్యాణ్.. వారికి ఇక నేనే బిడ్డను

జనసేన అధినేత పవన్ కల్యాణ్ బర్త్ డే వేళ విషాద ఛాయలు అలుముకున్నాయి. చిత్తూరు జిల్లాలో ఫ్లెక్సీ కడుతుండగా కరెంట్ షాక్ తగిలి ముగ్గురు అభిమానులు మరణించారు. ఈ ఘటనపై పవన్ కల్యాణ్ స్పందించారు. గుండెల నిండా తనపట్ల అభిమానం నింపుకున్న ముగ్గురు యువకులు విద్యుత్ షాక్‌తో మరణించడం దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆయన అన్నారు. ఇది మాటలకందని విషాదమని పేర్కొన్నారు జనసేనాని. ఆ తల్లిదండ్రుల గర్భ శోకాన్ని అర్ధం చేసుకోగలనన్న ఆయన... వారికి తానే ఇకపై బిడ్డగా నిలుస్తానని తెలిపారు. ఆర్థికంగా ఆ కుటుంబాలను తానే ఆదుకుంటానని చెప్పారు పవన్ కల్యాణ్.


Post a Comment

0 Comments