మోదీ ఇడ్లీలు... రూ.10కి నాలుగు... ఇవీ ప్రత్యేకతలు

మోదీ ఇడ్లీలు... రూ.10కి నాలుగు... ఇవీ ప్రత్యేకతలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరుతో ఇడ్లీలను తమిళనాడులోని... సేలంలో తక్కువ ధరకు అమ్మబోతున్నారు. మోదీ ఇడ్లీలుగా పిలుస్తున్న వీటిని... రూ.10కి నాలుగు ఇవ్వనున్నారు. తమిళనాడులో బీజేపీ ప్రచార విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహేష్ త్వరలో ప్రారంభించబోతున్నారు.
ఈ ఇడ్లీల గురించి బాగా ప్రచారం చేయడానికి... నగరం మొత్తం పోస్టర్లు ఏర్పాటు చేశారు. పోస్టర్లపై ఓవైపు ప్రధాని నరేంద్రమోదీ, మరోవైపు మహేష్ ఫొటో ఉన్నాయి. మధ్యలో రూ.10కి నాలుగు ఇడ్లీలు అని రాశారు.

ఇడ్లీలను అత్యంత పరిశుభ్రమైన వాతావరణంలో తయారుచేస్తామనీ, సంబార్‌తో సెర్వ్ చేస్తామని చెబుతున్నారు. ముందుగా నగరంలో 22 షాపులు ఏర్పాటు చేస్తామనీ... అవి సక్సెస్ అయితే... మరిన్ని షాపులు పెంచుతామని చెబుతున్నారు.

Post a Comment

0 Comments