హైదరాబాద్ (చట్టం) : రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న నేపధ్యంలో రాష్ట్ర పోలీసు శాఖ ముందు జాగ్రతలు తీసుకుంది. ఎలాంటి అత్యవసర, క్లిష్ట పరిస్థితులు ఎదురైనా వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్దాంగా ఉండాలని డిజీపి మహేందర్ రెడ్డి ఆదేశించారు. వైరస్ వేగంగా విస్తరించే ప్రమాదమున్నందుకు సిబ్బంది జాగ్రతలు తీసుకోవాలని, వ్యక్తిగత శుభ్రత, భౌతిక దూరం పాటించాలని సూచనలు చేశారు. దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీసుల పనితీరుపై ప్రశంసలు వస్తున్నాయని చె ప్పారు.
శనివారం సాయంత్రం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పోలీసు సిబ్బంది తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వ్యాధి వ్యాప్తి ప్రమాదకర దశలో ఉన్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. స్టేషన్ వచ్చేవారికి చేతులు కడుక్కునేందుకు సబ్బు ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేసే సమయంలో హెల్మెట్ తదితరాలు భద్రత కోసం ధరించాలన్నారు. కరోనా అనుమానిత వ్యక్తులను తరలించే సమయంలో 108, వైద్య, రెవెన్యూ, మున్సిపాలిటీ శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు.
ఈ అన్ని శాఖలతో ప్రతీ పోలీస్ ఠాణా పరిధిలో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి, దాని ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్డేట్ చేసుకోవాలని సూచించారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లఘించిన వారిపై కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లాక విధిగా స్నానం చేయాలని, కమ్యూనికేషన్ డివైజ్లను నిరంతరం శానిటైజ్ చేసుకోవాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న క్రమంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.
పోలీసు సంక్షేమ నిధికి రూ.50 లక్షల విరాళం.. శనివారం సాయంత్రం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో పోలీసు సిబ్బంది తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వ్యాధి వ్యాప్తి ప్రమాదకర దశలో ఉన్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా పనిచేయాలని సూచించారు. స్టేషన్ వచ్చేవారికి చేతులు కడుక్కునేందుకు సబ్బు ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేసే సమయంలో హెల్మెట్ తదితరాలు భద్రత కోసం ధరించాలన్నారు. కరోనా అనుమానిత వ్యక్తులను తరలించే సమయంలో 108, వైద్య, రెవెన్యూ, మున్సిపాలిటీ శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు.
ఈ అన్ని శాఖలతో ప్రతీ పోలీస్ ఠాణా పరిధిలో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి, దాని ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అప్డేట్ చేసుకోవాలని సూచించారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లఘించిన వారిపై కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లాక విధిగా స్నానం చేయాలని, కమ్యూనికేషన్ డివైజ్లను నిరంతరం శానిటైజ్ చేసుకోవాలని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న క్రమంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.
సువెన్ ఫార్మాసూటికల్స్ సీఈఓ వెంకట్ జాస్తి రూ.50 లక్షలు పోలీసు సంక్షేమ నిధికి విరాళమిచ్చారు. శనివారం ఆ చెక్కును డీజీపీ మహేందర్రెడ్డికి ఆయన కార్యాలయంలోనే అందజేశారు. లాక్డౌన్ నేపథ్యంలో పోలీసు శాఖ నిరంతరం విధులను నిర్వహించడాన్ని ఆయన ప్రశంసించారు. రాష్ట్రంలో నిత్యావసరాలు, మందులు, తదితరాల రవాణాలో పోలీసులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.

0 Comments