జూలై 19వ తేదీన తన స్నేహితుడు అబ్రహాంతో కలసి బైక్ మీద వస్తుండగా కొత్తపేట చెక్ పోస్టు వద్ద ఓ కానిస్టేబుల్ వారిని ఆపాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్ చేయడానికి వారిని ఆపారు. ఈ సందర్భంగా కానిస్టేబుల్, యువకుల మధ్య వాగ్వాదం జరిగిందని, ఈ సందర్భంగా కానిస్టేబుల్ వారిపై చేయి చేసుకుని, ఆ తర్వాత రూల్స్ గురించి మాట్లాడారని బాధితుడి కుటుంబసభ్యులు ఆరోపించారు. అనంతరం కానిస్టేబుల్ తమ ఎస్ఐ విజయ్ కుమార్ను పిలిపించారు. ఇద్దరు యువకులను ఎస్ఐ జీపులోకి నెట్టారు. జీపులో పోలీస్ స్టేషన్కు వెళ్తుండగా, కిరణ్ పారిపోవడానికి ప్రయత్నించి.. జీపులో నుంచి జంప్ చేశాడని, ఈ సందర్భంగా అతడి తలకు బలమైన గాయమైందని పోలీసులు చెబుతున్నారు. కిరణ్ కుమార్ రక్తపు మరకలు రోడ్డు మీద ఉన్నాయని, అతడి జుట్టు కూడా అక్కడ లభించిందని ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ తెలిపారు. వారిద్దరూ మద్యం తాగి ఉన్నారని పోలీసులు చెప్పారు
0 Comments