ఏపీలో వారికి ఉచిత ఇసుక.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం

ఏపీలో వారికి ఉచిత ఇసుక.. జగన్ సర్కార్ కీలక నిర్ణయం

ఇసుకకు సంబంధించి జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎడ్లబళ్లపై సొంత అవసరాలకు ఇసుక ఉచితంగా తీసుకెళ్లొచ్చని చెప్పిన ప్రభుత్వం.. ట్రాక్టర్లకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. కానీ కండిషన్స్ అప్లై అంటోంది. 1,2,3 ఆర్డర్‌ రీచ్‌లలో మాత్రమే అనుమతి తెలిపింది.. సొంత అవసరాలు, బలహీనవర్గాల గృహ నిర్మాణం, సహాయ పునరావాస ప్యాకేజీలకు మాత్రమే ఇసుకను ఉచితంగా తీసుకెళ్లొచ్చని తెలిపింది.

ఒకవేళ ఎవరైనా సొంత అవసరాలకు ఇసుక తీసుకెళ్లానుకుంటే గ్రామ, వార్డు సచివాలయాల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అనుమతి కోరిన వారి వివరాలు నమోదు చేసుకుని, ఎలాంటి ఫీజు లేకుండా సచివాలయాలు అనుమతి పత్రం ఇస్తాయి. బలహీన వర్గాల గృహ నిర్మాణం, సహాయ, పునరావాస ప్యాకేజీలకు సంబంధించిన పనులకు ఉచితంగా ఇసుకను ట్రాక్టర్ల ద్వారా తీసుకెళ్లేందుకు కలెక్టర్‌ అనుమతి తీసుకోవాలి. అలాగే కలెక్టర్‌ బాధ్యతలు అప్పగించిన మరో అధికారి అయినా అనుమతి ఇవ్వొచ్చు.



రాష్ట్రవ్యాప్తంగా నదుల పరిసర గ్రామాల ప్రజల సొంత అవసరాలకు ఎడ్ల బండ్ల ద్వారా ఇసుకను ఉచితంగా తీసుకెళ్లడానికి అనుమతించాలని సీఎం జగన్ ఇప్పటికే ఆదేశించారు. ఇందుకు పంచాయతీ కార్యదర్శి నుంచి రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలన్న షరతు ఉంటుంది. ఎడ్ల బండ్ల ద్వారా తీసుకెళ్లి వేరే చోట నిల్వ చేసి, విక్రయిస్తే చర్యలు తీసుకుంటారు. సొంత అవసరాలకే ఎడ్ల బండ్లలో ఉచితంగా ఇసుక తీసుకెళ్లేలా నిబంధనలు అమలు చేయనున్నారు. ఇప్పుడు ట్రాక్టర్లకు అనుమతి ఇచ్చారు.

Post a Comment

0 Comments