హైదరాబాద్‌ మార్కెట్లలో స్వచ్ఛంద లాక్‌డౌన్.. చార్మినార్ ప్రాంతం ఇలా!

హైదరాబాద్‌ మార్కెట్లలో స్వచ్ఛంద లాక్‌డౌన్.. చార్మినార్ ప్రాంతం ఇలా!

జీహెచ్ఎంసీ పరిధిలో కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. మార్కెట్, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. లాక్‌డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత జనం రద్దీ బాగా పెరిగింది. దీంతో వ్యాపారులకు కోవిడ్ సోకింది. రోజు రోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. వ్యాపారులే స్వచ్ఛందంగా దుకాణాలను మూసివేస్తున్నారు. ఇప్పటికే సికింద్రాబాద్‌లోని బనారస్‌ పట్టు చీరల మార్కెట్‌ను బంద్‌ చేయగా, నేటి నుంచి (జూన్ 26) లాడ్ బజార్ మూతపడింది. వచ్చే శుక్రవారం వరకు బంద్‌ చేస్తున్నట్లు లాడ్‌ బజార్‌ ట్రేడ్‌ యూనియన్‌ వర్గాలు తెలిపాయి.

సికింద్రాబాద్‌ జనరల్‌ బజార్‌, సూర్యా టవర్స్‌, ప్యారడైజ్‌ ప్రాంతాల్లోని దుకాణాలన్నీ నేటి నుంచి మూతపడ్డాయి. జూలై 5 వరకు ఈ షాపులు తెరుచుకోవు. ఎలక్ట్రికల్‌ మార్కెట్‌ అయిన ట్రూప్‌ బజార్‌ కూడా ఆదివారం నుంచి స్వచ్ఛందంగా మూత పడనుంది. ఆదివారం నుంచి జూలై 5 వరకు బేగంబజార్‌ మార్కెట్‌ను పూర్తిస్థాయిలో మూసివేయనున్నారు.

Post a Comment

0 Comments