చిత్తూరు మండలంలోని బ్రాహ్మణ పల్లికి చెందిన ఇద్దరు చిన్నారులు అమ్మమ్మ ఊరైన ఏఎల్ పురానికి వెళ్లారు. దీంతో వాళ్ల అమ్మమ్మ చికెన్ వండి.. పిల్లలకు పెడదామని భావించింది. చికెన్ చేసే సమయంలో మసాలా బదులు ఏకంగా గుళికలు, మందులు వేసేసింది.
ఈ గుళికలు వేసిన చికెన్ భోజనం తినడంతో ఆ ఇద్దరు బాలురు మృతి చెందారు. మతిస్థిమితం లేని అమ్మమ్మ వంట వండటం వల్లే ఈ ప్రమాదం జరిగిందని చివరకు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
0 Comments