వైఎస్ జగన్‌కు ప్రధాని మోదీ స్పెషల్ విషెస్.. ట్విట్టర్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఏపీ సీఎం

వైఎస్ జగన్‌కు ప్రధాని మోదీ స్పెషల్ విషెస్.. ట్విట్టర్‌లో టాప్ ట్రెండింగ్‌లో ఏపీ సీఎం

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. జీవితాంతం సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీతో పాటూ పలువురు ప్రముఖులు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వైఎస్సార్‌సీపీ నేతలు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ట్విట్టర్‌లో #HBDManOfMassesYSJagan హ్యాష్ ట్యాగ్‌తో విషెస్ మోత మోగుతోంది.

అలాగే రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్‌ పుట్టినరోజు సందర్భంగా ఆ వేడుకలను అభిమానులు ఘనంగా చేపట్టారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నేతలు భారీ ఎత్తున సంబరాలు, కేక్ కటింగ్స్‌ చేస్తున్నారు. అలాగే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుట్టిన రోజు ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో సరికొత్త రికార్డ్ నమోదైంది. జక్కంపూడి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో 2,745 మంది రక్తదానం చేసి రాష్ట్ర చరిత్రలో రికార్డు సృష్టించారు.

Post a Comment

0 Comments