రైతులకు కేసీఆర్ సర్కార్ గుడ్‌న్యూస్.. పది రోజుల్లో.. ఖాతాల్లో డబ్బులు

రైతులకు కేసీఆర్ సర్కార్ గుడ్‌న్యూస్.. పది రోజుల్లో.. ఖాతాల్లో డబ్బులు

తెలంగాణ రైతులకు కేసీఆర్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. యాసంగి సీజన్‌లో రైతు బంధుకి సీఎం కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 60 లక్షల మంది రైతులకు రైతుబంధు సొమ్ము ఖాతాలో జమకానుంది. రైతు బంధు నిధులు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సుమారు 7,500 కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది తెలంగాణ సర్కార్.

ఎకరానికి 5 వేల రూపాయల చొప్పున కోటిన్నర ఎకరాలకు రైతు బంధు నిధులు విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. డిసెంబర్ 15 వ తేదీ నుంచి రైతు బంధు నిధులు రైతన్న ఖాతాల్లో జమ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు సమాచారం. అంటే మరో పది రోజుల్లో రైతు బంధు సొమ్ము ఖాతాల్లో పడనుంది. గతంలో పంపిణీ చేసిన తరహాలోనే భూమి విస్తీర్ణం వారీగా రైతు బంధు నిధులు జమ చేసే అవకాముంది. గత సీజన్‌లో రైతు బంధు కోసం 7,360 కోట్లు జమ చేయగా.. ఈ సారి కొత్తగా పట్టాదారు పాసుపుస్తకం పొందిన రైతులను కలుపుకుని రూ.7.500 కోట్లు అవసరమవుతాయని సర్కార్ అంచనా వేసింది.

Post a Comment

0 Comments