ప్రైవేటు స్కూల్ టీచర్లకు సీఎం కేసీఆర్ శుభవార్త.. నెలకు రూ. 2 వేల సాయంతో పాటు..

ప్రైవేటు స్కూల్ టీచర్లకు సీఎం కేసీఆర్ శుభవార్త.. నెలకు రూ. 2 వేల సాయంతో పాటు..

 ఎక్కువ మంది చూస్తున్న తెలుగు కోటేశన్స్ ఇవే

కరోనా వ్యాప్తితో విద్యా సంస్థలు మూతపడి ఇబ్బందులు పడుతున్న ప్రైవేటు విద్యాలయాల ఉపాధ్యాయులకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు వరాలు కురిపించాడు. విద్యాసంస్థలు మూతపడడంతో ఉపాధి కోల్పోయిన వారికి అండగా నిలవాలని నిర్ణయించారు. 

ఎక్కువ మంది చూస్తున్నది :తెలుగు వాట్సాప్ స్టేటస్ వీడియోస్

ఈ మేరకు వారికి ఆర్థిక సహాయంతో పాటు కొన్ని సరుకులు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తిపై గురువారం సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. 

ఈ సమావేశంలో ప్రైవేటు ఉపాధ్యాయులు, సిబ్బంది పడుతున్న కష్టాలు ప్రస్తావనకు వచ్చాయి. ముఖ్యంగా నాగార్జునసాగర్‌లో ప్రైవేటు ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకోవడం, తాజాగా అతడి భార్య కూడా బలవన్మరణానికి పాల్పడిన విషయాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. 

తెలుగు డైలాగ్ స్టేటస్ వీడియోస్

దీంతో వెంటనే సీఎం కేసీఆర్‌ స్పందించి వారిని ఆదుకునేందుకు ఏం చర్యలు తీసుకోవాలని చర్చించారు. ఈ క్రమంలో టీచర్లకు నెలకు రూ.2 వేల నగదు సహాయం, 25 కిలోల బియ్యం అందించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ప్రైవేటు టీచర్లు వెంటనే బ్యాంక్‌ ఖాతాలు, గుర్తింపు కార్డులతో కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అయితే గుర్తింపు పొందిన ప్రైవేటు ఉపాధ్యాయులకు మాత్రమే ఈ సహాయం అందనుంది. మొత్తం లక్షా 45 వేల మంది ఉపాధ్యాయులు, సిబ్బంది లబ్ధి పొందనున్నారు.

Post a Comment

0 Comments