హోళీ పండుగ విశిష్టత

హోళీ పండుగ విశిష్టత

ప్రతి సంవత్సరం భారతీయుల సంప్రదాయం ప్రకారం పాల్గుణ శుద్ధ పౌర్ణమినాడు హోళీ పండుగను జరుపుకుంటాము. రంగుల ఆనందంతో చిన్నా, పెద్ద, మత, వయో బేధం లేకుండా హోళీ ఉత్సవాలను జరుపుకుంటారు. హోళీ పూర్ణిమను కాముని పున్నంగా పిలుస్తుంటారు. ఈ పౌర్ణమికి ముందురోజు రాత్రి అన్ని ప్రాంతాల్లో కాముడి దహానాన్ని గ్రామంలో ఇంటింటి నుండి సేకరించిన పిడుకలతో దగ్ధం చేస్తారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విశిష్ట సందర్భాన్ని పురస్కరించుకుని హోళీ జరుపుకుంటారు.
వసంతోత్సవం ..

ఫాల్గుణ మాసం పూర్ణిమనాడు జరుపుకునే పండుగ కనుక ఫాల్ఘుణోత్సవమని, వసంత రుతువును స్వాగతించే వేడుక కాబట్టి వసంతోత్సవమని పిలుచుకుంటాము. మనం కాముని పున్నమ పేరుతో హోళీ వేడుకలను జరుపుకుంటాము. కర్ణాటకలో 'కామన హబ్బ', తమిళనాట 'కామక్ పండిగె' అని పిలుస్తారు. మదనుడి దహనం, ఆయన పునరుజ్జీవనాన్ని పురస్కరించుకుని ఈ వేడుక చేసుకుంటారు. దక్షిణాదికన్నా ఉత్తర భారతంలో హోళీ పండుగకు ఎక్కవ ప్రాముఖ్యం ఉంది.

పురాణ గాథ ఇదీ ..?
హోళీ పర్వదినం వెనుక చాలా పురాణ గాథలు ఉన్నాయి. దైవకార్య నిమిత్తం యోగ నిష్ఠలో ఉన్న పరమేశ్వరుడికి తపోభంగం కలిగించమని దేవతలందరూ మన్మథుడిని కోరడంతో ఆయన శివుడి మీదకు తన బాణం ప్రయోగిస్తాడు. దీంతో ఆగ్రహం చెందిన పరమేశ్వరుడు తన మూడో కంటిని తెరచి మన్మధుడిని బూడిద చేస్తాడు. మదనుడి భార్య రతీదేవి పరమేశ్వరుడిని వేడుకోవడంతో బోళా శంకరుడు కరిగిపోయి మన్మధుడు రతీదేవికి మాత్రమే కనిపించేలా వరమిచ్చాడు అలా మళ్లీ మన్మధుడు రతీదేవికి దక్కాడు.
ఇదీ ప్రాశస్త్యం
ఈ పండుగ జరుపుకోవడానికి ఈ కథ కూడా ఓ కారణమైందని కొందరు విశ్వసిస్తారు. పూర్వం రఘుమహారాజు కాలంలో హోలిక అనే ఓ రాక్షసి ఉండేదట. అది పసిపిల్లలను సంహరిస్తుండేది. ఒక యోగి సూచన మేరకు ఓ వృద్ధురాలు పిల్లల చేత ఆ రాక్షసిని బాగా తిట్టించిందట ఆ తిట్లు వినలేక హోలిక చనిపోయింది. ఆమెను ఊరి ప్రజలందరూ తగలబెట్టి హోళీ పండుగను జరుపుకున్నారట. ఆ సంప్రదాయమే ఇప్పటికీ కొనసాగుతోందని మరికొందరి నమ్మకం.

Post a Comment

0 Comments