రైతులకు రక్షణగా పోలీసు వ్యవస్థ ఉండాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. రైతుల సమస్యలపై ప్రత్యేకంగా జిల్లాకో పోలీస్ స్టేషన్ ఆలోచన చేస్తున్నామని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం తదితర వ్యవహారాల్లో మోసాలు జరిగితే రైతులకు అండగా నిలవాలని.. వారికి న్యాయం చేయడం కోసం ఈ వ్యవస్థ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు సీఎం జగన్ అన్నారు.
వ్యాపారుల నుంచి మోసాలకు గురి కాకుండా రైతుకు భద్రత కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశమని వెల్లడించారు. ప్రతి పోలీస్స్టేషన్లో దిశ హెల్ప్ డెస్క్ తరహాలో రైతుల కోసం ఒక డెస్క్ను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ నూతన వ్యవస్థ ఎలా ఉండాలన్న దానిపై అధ్యయనం చేసి కార్యాచరణ రూపొందించాలని అధికారలను ముఖ్యమంత్రి ఆదేశించారు.
0 Comments