మెట్రో రైలులో గుండె తరలింపు.. ఎల్బీనగర్ నుంచి జూబ్లీహిల్స్‌కు

మెట్రో రైలులో గుండె తరలింపు.. ఎల్బీనగర్ నుంచి జూబ్లీహిల్స్‌కు


అంబులెన్స్‌లో, ఫ్లైట్స్‌లో తరలించిన విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్‌లో తొలిసారిగా మెట్రో రైలులో బ్రెయిన్ డెడ్ అయిన మనిషి గుండెను తరలించారు వైద్యులు. మెట్రో రైలు అధికారుల సహకారంతో అపోలో ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా గుండెను తరలించారు. నల్లగొండ జిల్లాకు చెందిన 45 ఏండ్ల రైతు బ్రెయిన్ డెడ్ అయ్యాడు. దీంతో గుండెను దానం చేసేందుకు ఆ రైతు కుటుంబం ముందుకొచ్చింది. దీంతో రైతు గుండెను మరో వ్యక్తికి అమర్చనున్నారు.

జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తికి గుండె మార్పిడి శస్త్రచికిత్సకు వైద్యులు ఏర్పాట్లు చేశారు. డాక్టర్ గోకులే నేతృత్వంలో ఈ శస్త్రచికిత్స నిర్వహించనున్నారు. ఎల్బీనగర్ కామినేని ఆస్పత్రి నుంచి జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి గుండెను తరలించారు. జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో వ్యక్తికి గుండె మార్పిడి చేసేందుకు వైద్యులు సిద్ధమయ్యారు.

అయితే నగరంలో విపరీతంగా పెరిగిపోయిన ట్రాఫిక్‌ నేపథ్యంలో గుండె తరలింపునకు వైద్యులు హైదరాబాద్‌ను మెట్రోను ఎంచుకున్నారు. ఈ మేరకు మెట్రో అధికారులతో సంప్రదింపులు జరిపారు. మెట్రో సిబ్బంది కూడా ముందుకు రావడంతో ఉప్పల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు ఉండే ట్రాఫిక్ దృష్ట్యా మెట్రోలో గుండెను తరలించారు. మెట్రో రైలు అధికారులకు ఆస్పత్రి సిబ్బంది సమాచారం ఇవ్వడంతో ఈ ఏర్పాట్లు చేశారు.

Post a Comment

0 Comments