తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాదాలు పట్టుకుంది ఓ మహిళ. తమ పొట్ట కొట్టొద్దని కోరింది. ఆయన పాదాలు పట్టుకుని వేడుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో ఈ ఘటన జరిగింది. కృష్ణవేణి అనే మహిళ ఖమ్మం జిల్లాలో ఫీల్డ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న తనను అన్యాయంగా తొలగించారని వాపోయింది. తనకు ఉపాధి కల్పించి ఆదుకోవాలని కోరింది. ‘మా పొట్టలను కొట్టొద్దు. మీ పాదాలు పట్టుకుంటా. తెలంగాణ వస్తే కొలువులు వస్తాయని అనుకున్నాం. ఉన్న కొలువులు పోతాయని ఉహించలే. మాకు పర్మినెంట్ ఉద్యోగం లేక పోయినా ఫర్వాలేదు. ఉన్న కొలువులను పునరుద్ధరణ చేయండి
0 Comments