తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్

తెలంగాణ ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పిన సీఎం కేసీఆర్

నల్లగొండ జిల్లా హాలియా బహిరంగ సభలో పాల్గొన్న తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు మరో గుడ్ న్యూస్ చెప్పారు. తెలంగాణలో కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తున్న నిరుపేదలకు త్వరలో పెన్షన్లు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇక రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులు కూడా మంజూరు చేస్తామని వెల్లడించారు. నల్లగొండ జిల్లాలో కొత్తగా పలు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశామని.. 

ఏడాదిలో వాటిని పూర్తి చేస్తామని ఆయన అన్నారు. ఈ లిఫ్ట్‌లు పూర్తి చేయకపోతే వచ్చే ఎన్నికల్లో తాము ప్రజలను ఓట్లు అడగబోమని సీఎం కేసీఆర్ అన్నారు. ఇక నల్లగొండ జిల్లాలో ఉన్న 844 ప్రతి గ్రామపంచాయతీలకు రూ. 20 లక్షలు మంజూరు చేస్తామని అన్నారు. ఇక జిల్లాలోని ప్రతి మండల కేంద్రానికి రూ. 30 లక్షలు మంజూరు చేస్తామని తెలిపారు. నల్లగొండ మున్సిపాలిటీ రూ. 10 కోట్లు ఇస్తామని..మిర్యాలగూడ మున్సిపాలిటీ 5 కోట్లు, మిగతా మున్సిపాలిటికీ కోటి రూపాయలు మంజూరు చేస్తామని అన్నారు. ఇందుకు సంబంధించిన 186 కోట్లు విడుదలకు త్వరలోనే జీవో జారీ చేస్తామని సీఎం కేసీఆర్ అన్నారు.

Post a Comment

0 Comments