తెలంగాణ భవన్లో తెరాస రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసింది. సుమారు రెండున్నర గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో వివిధ అంశాలపై నేతలకు పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా సీఎం మార్పు ఊహగానాలపై ఆయన స్పష్టత ఇచ్చారు. పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని.. పదేళ్లు తానే సీఎంగా ఉంటానని చెప్పారు. ఎమ్మెల్యేలు అనవసర వ్యాఖ్యలు చేయొద్దని చురకలంటించారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్కు సీఎం పదవి కట్టబెడతారనే ప్రచారం నేపథ్యంలో కేసీఆర్ స్పష్టత ఇచ్చారు.
మరోవైపు ఈనెల 12 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నట్లు చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 50వేల సభ్యత్వాలు చేయాలని సూచించారు.
0 Comments