నిజామాబాద్ (చట్టం) : విశ్వతేజ శిక్షణ కేంద్రంలో జెసిఐ జోన్ ట్రేనర్ సెనేటర్ విజయానంద్ ముఖ్య అతిధిగా విచ్చేసి ట్రేనింగ్ టూ ట్రేనర్ 2రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శిక్షణకు వచ్చిన వారితో మాట్లాడుతూ శిక్షణ తరగతుల ద్వారా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. నైపుణ్యం పెరిగితే ఎక్కడైనా రానిస్తారని తెలిపారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నప్పుడే మంచి ఫలితాలు వస్తాయని సూచించారు. ఇట్టి ట్రేయినింగ్లో సాఫ్ట్ స్కిల్ ట్రైనర్ తిరునగరి శ్రీహరి, ఆదిత్య, ప్రసాద్ ట్రేయినీస్కు శిక్షణ ఇస్తారు. ఈ కార్యక్రమంలో టక్కూరి హన్మాండ్లు, నరహరి, ట్రైనీస్ తదితరులు పాల్గొన్నారు.




0 Comments