నిజామాబాద్ (చట్టం) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఉచిత పుస్తకాల పంపిణి కార్యక్రమంలో భాగంగా డిచ్పల్లి మండలం దూస్గాం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో డిచ్పల్లి ఎంపిపి గద్దె భూమన్న చేతుల మీదుగా పదవ తరగతి విద్యార్థులకు పుస్తకాలు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శివారెడ్డి, ఉప సర్పంచ్ సురేష్, సుధాకర్, జ్ఞానేశ్వర్, దుర్గేష్, గంగన్న, వెంకటేష్, సొసైటి డైరెక్టర్ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

0 Comments