ఆగస్టు 15న 30 లక్షల పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు

ఆగస్టు 15న 30 లక్షల పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు

రాష్ట్ర ప్రజలకు మేలు చేసే ప్రతి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కోర్టుల ద్వారా అడ్డుకుంటోందని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వకుండా అడ్డుకున్నారని, చివరకు దీని కోసం ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు.

కోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేసిన ఆయన, ఆగస్టు 15న పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు. రాష్ట్రమంతా 30 లక్షల పేద కుటుంబాలకు ఆరోజున ఇళ్ల స్థలాల పట్టాలు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.

కృష్ణా జిల్లా మైలవరం నియోజకవర్గం, ఇబ్రహీంపట్నం చేరువలోని గాజులపేటలోని వైయస్సార్‌ జగనన్న కాలనీల మొక్కలు నాటిన సీఎం వైయస్‌ జగన్, 71వ వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ‘జగనన్న పచ్చతోరణం’ గా చేపట్టిన ఈ కార్యక్రమంలో రాష్ట్రమంతా ఈ ఏడాది 20 కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Post a Comment

0 Comments