RRR’ సినిమాకు అనుకోని బ్రేక్.. నిర్మాతకు పెద్ద షాక్..

RRR’ సినిమాకు అనుకోని బ్రేక్.. నిర్మాతకు పెద్ద షాక్..

రాజమౌళితో పాటు ట్రిపుల్ ఆర్ చిత్ర యూనిట్ అంతా ఇప్పుడు ఖాళీగానే ఉన్నారు. కరోనా వైరస్ నుంచి బయట పడిన తర్వాత రాజమౌళి, ఆయన నిర్మాత దానయ్య కూడా ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తన సినిమాకు కావాల్సిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఇంటి దగ్గరే ఉండి చూసుకుంటున్నాడు దర్శక ధీరుడు. నెక్ట్స్ షెడ్యూల్‌కు కావాల్సిన ఏర్పాట్లు అన్నీ ఇప్పుడు చేసుకుంటున్నాడు జక్కన్న. ఈ సినిమా తర్వాత షెడ్యూల్ దసరా నుంచి మొదలు కానుందని ప్రచారం జరుగుతుంది.

దీనికోసం ఇప్పట్నుంచే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే కరోనా రోజురోజుకీ విజృంభిస్తున్న తరుణంలో ఇంకొన్ని రోజులు ఇంటి దగ్గరే ఉండాలని ఫిక్స్ అయిపోయారు దర్శక నిర్మాతలు. అయితే ఎప్పుడు షూటింగ్ మొదలు పెట్టినా కూడా నిర్మాత దానయ్యను మాత్రం ఓ సమస్య వెంటాడుతుంది. అది ఆయనకు బడ్జెట్ కూడా పెంచేస్తుంది. ఇప్పటికే ఆలస్యం కావడంతో కోట్లు నష్టపోయాడు దానయ్య. అందులోనూ ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ అదనపు ఖర్చులు కూడా ఈయనపై పడనున్నాయి.

ట్రిపుల్ ఆర్ షూటింగ్ కోసం రామ్ చరణ్, ఎన్టీఆర్ త్వరలోనే సిద్ధం కానున్నారు. రాజమౌళి కూడా అన్నీ సిద్ధం చేసుకుంటున్నాడు. అయితే దసరా నుంచి మొదలు పెట్టినా.. అల్యూమీనియం ఫ్యాక్టరీలో వేసిన భారీ సెట్‌లోనే నెక్ట్స్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఈ సెట్ లాక్‌డౌన్‌కు ముందు నిర్మించారు. దాదాపు 20 కోట్లతో ఈ సెట్ నిర్మించారు. అయితే ఆర్నెళ్లుగా వాడకపోవడంతో ఇది పూర్తిగా పాడైపోయిందని తెలుస్తుంది. దీన్ని బాగు చేయడానికి నిర్మాతకు మళ్లీ కొన్ని కోట్లు ఖర్చు చేయాల్సిన పరిస్థితి.

Post a Comment

0 Comments