సీఎం జగన్ సీరియస్..కలెక్టర్లకు కీలక ఆదేశాలు

సీఎం జగన్ సీరియస్..కలెక్టర్లకు కీలక ఆదేశాలు

కరోనా వైరస్ వైద్యానికి సంబంధించి అధిక ఫీజులు వసూలు చేయడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక ఫీజు వసూలు కోవిడ్‌ ఆస్పత్రుల నిర్వహణపై కలెక్టర్లు దృష్టి పెట్టాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి జగన్ ‘స్పందన’ కార్యక్రమంపై మంగళవారం కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలో పేర్కొన్న దాని కంటే కోవిడ్‌ రోగుల వద్ద నుంచి ఎక్కువ వసూలు చేస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

కరోనా బాధితుల పట్ల వైద్యులు మానవత్వం చూపించాలని సీఎం జగన్ హితవు పలికారు. కోవిడ్ బాధితుడికి అర్ధ గంటలోపు బెడ్ ఇవ్వాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని స్పష్టం చేశారు. 104, 14410 కాల్‌ సెంటర్లకు వచ్చే ఫోన్ కాల్స్‌కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అనంతరం వరదలు, సహాయక చర్యలపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. గోదావరి, కృష్ణా నదుల్లో వరదలు తగ్గుముఖం పడుతున్నాయని, సెప్టెంబర్ 7 లోపు పంట నష్టంపై అంచనాలు రూపొందించాలని అధికారులకు ఆదేశించారు. అలాగే గోదావరి వరద ముంపు బాధితులకు రూ. 2 వేలు అదనపు పరిహారం ఇచ్చేలా ప్రణాళిక రూపొందించాలన్నారు.

Post a Comment

0 Comments