తెలంగాణలో మూడో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్..

తెలంగాణలో మూడో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్..

తెలంగాణలో మూడో ఎమ్మెల్యే కరోనా వైరస్ బారిన పడ్డారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తాకు కోవిడ్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌తో కాంటాక్ట్ కావడంతో ఆయనకు కరోనా సోకిందని భావిస్తున్నారు. బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా తేలగా.. ఆయన ఆదివారం హాస్పిటల్‌లో చేరారు. నేరుగా కారు డ్రైవింగ్ చేసుకుంటూ ఆయన నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లారు.

అంతకు ముందు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఆయనతో కాంటాక్ట్ కావడం వల్లే నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేకు కోవిడ్ సోకింది. తాజాగా గణేష్ గుప్తాకు కరోనా సోకడంతో తెలంగాణలో కోవిడ్ బారిన పడిన ఎమ్మెల్యేల సంఖ్య మూడుకి చేరింది.

Post a Comment

0 Comments