నిబంధనలను పాటించని వ్యక్తులను ఆపి వారికి వివరించాలని కోరారు. మాస్క్ ధరించకుండా పబ్లిక్ ప్లేస్ కు వెళ్లడంతో ఓ దేశ ప్రధానికి 13 వేల జరిమానా విధించిన సంగతి గుర్తు చేశారు. గ్రామానికి సర్పంచి అయినా దేశ ప్రధానమంత్రి, ఎవరూ నిబంధనలకు అతీతులు కారు అని, బల్గేరియా ప్రధాని బోయికో బోరిసోవ్ గురించి తన ప్రసంగంలో మోదీ ఉదాహరించారు.
అన్ని జాగ్రత్తలు తీసుకొని మరిన్ని ఆర్థిక కార్యకలాపాలను మరింత వేగం పుంజుకునేలా చేస్తామని ప్రధాని మోదీ అన్నారు. స్వావలంబన భారత్ కోసం మనందరం 'local for vocal' సంకల్పంతో కదలాలని పిలుపు నిచ్చారు. 130 కోట్ల మంది దేశస్థులు ఇదే సంకల్పంతో కలిసి పనిచేయాలన్నారు.
0 Comments