లాడ్జీపై పోలీసులు దాడి వ్యభిచారం చేస్తున్న నలుగురు అరెస్టు

లాడ్జీపై పోలీసులు దాడి వ్యభిచారం చేస్తున్న నలుగురు అరెస్టు








              




 (చట్టం -సిద్దిపేట)  పట్టణంలో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే సమాచారంతో ఓ లాడ్జీపై పోలీసులు దాడి చేశారు. లక్ష్మీ లాడ్జ్‌లో వ్యభిచారం చేస్తున్న నలుగురు మహిళలు, నలుగురు పురుషులను అరెస్టు చేశారు. ఈ దాడుల్లో విటులు రాజయ్య, రాజు, నర్సింహులు, పెంటయ్యతో పాటు నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నట్టు సిద్దిపేట గ్రామీణ సీఐ వెంకటరామయ్య తెలిపారు. వ్యభిచారం, పేకాట లాంటి కార్యకలాపాలు చట్టవిరుద్ధమైనవని, అలాంటి వాటికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. 
వ్యభిచారం జరుగుతున్నట్టు తమకు అందిన సమాచారం మేరకు లాడ్జ్‌పై దాడులు చేసినట్టు సీఐ వెంకటరామయ్య చెప్పారు. పట్టణంతో పాటు ఇతర ప్రాంతాల్లో వ్యభిచారం చేస్తున్నట్లు సమాచారం ఉంటే పోలీసులకు తెలపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు.

x

Post a Comment

0 Comments