రైల్వేలో 14,033 కొలువులకు ధరఖాస్తుల ఆహ్వానం
నిజామాబాద్ (చట్టం):ఇండియన్ రైల్వేలో ఇంజనీరింగ్ ఉద్యోగాల మేళ ప్రారంభమైంది. 14,033 జూనియర్ ఇంజనీరింగ్, తత్సమాన కొలువుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఇందులో 13,034 జూనియర్ ఇంజనీర్ పోస్టులు, 49 జూనియర్ ఇంజనీర్(ఐటి), 456డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, 494 కెమికల్ అండ్ మెటలర్జీకల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. ఇక విద్యార్హత విషయానికి వస్తే డిగ్రీ, పిజిడిసిఏ/డిప్లోమా/బీఎస్సీ(కం ప్యూటర్ సైన్స్), బీటెక్ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ పూర్తి చేసినవారు ఆయా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనవరి 2 నుంచి 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను చేసుకొనె అవకావం కల్పించడం జరిగింది. మరింత సమాచారం కోసం సంబందిత జోనల్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వెబ్సైట్ను సందర్శించాలని అధికారులు తెలిపారు.

0 Comments