సజ్జనార్ మరో సంచలన నిర్ణయం.. సారు సూపరు!!

సజ్జనార్ మరో సంచలన నిర్ణయం.. సారు సూపరు!!

ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వినూత్న నిర్ణయాలతో దూసుకెళ్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పసిబిడ్డలకు పాలిచ్చే తల్లుల కోసం ఆర్టీసీ బస్టాండ్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లలో పసిబిడ్డలకు తల్లులు పాలిచ్చేందుకు వీలుగా బ్రెస్ట్ ఫీడింగ్ కియోస్క్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా తొలుత హైదరాబాద్ ఎంజీబీఎస్‌లో బ్రెస్ట్ ఫీడింగ్ కేంద్రాలను ప్రారంభించారు. రాష్ట్రంలోని అన్ని బస్టాండ్లలో బ్రెస్ట్ ఫీడింగ్ కియోస్క్‌లను ఏర్పాటు చేయాలని ఎండీ వీసీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు.


అమెజాన్ ఆఫర్ల ఫైనల్ డేస్ | టీవీలు మరియు అప్లయన్సెస్‌పై 65% వరకు తగ్గింపు
ఆర్టీసీ ఎండీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వీసీ సజ్జనార్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దసరా పండుగ సమయంలో ప్రత్యేక బస్సులకి అదనపు చార్జీలు రద్దు చేసి సంచలనానికి తెరలేపారు. ఒకే గమ్యానికి చేరాల్సిన ప్రయాణికులు ఉంటే ఆర్టీసీ బస్సు ఇంటికే పంపిస్తానంటూ వినూత్న సర్వీసు మొదలుపెట్టారు. కార్మికుల సంక్షేమం కోసం కూడా చర్యలు తీసుకుంటున్నారు. నష్టాల ఊబిలో చిక్కుకున్న ఆర్టీసీని గట్టెక్కించేందుకు వినూత్న నిర్ణయాలతో దూసుకుపోతున్నారు.

Post a Comment

0 Comments