జగన్ సర్కార్ శుభవార్త.. వారందరి అకౌంట్లలో డబ్బులు జమ, మళ్లీ రూ.10వేలు!

జగన్ సర్కార్ శుభవార్త.. వారందరి అకౌంట్లలో డబ్బులు జమ, మళ్లీ రూ.10వేలు!

జగనన్న తోడు పథకం కింద రుణాలు పొంది..
 సకాలంలో చెల్లింపులు జరిపిన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం బుధవారం వడ్డీ జమ చేసింది. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి బటన్‌ నొక్కి ఈ మొత్తాన్ని జమ చేశారు. రుణం తీర్చిన వారు తిరిగి బ్యాంకుల నుంచి రూ.10 వేలు రుణంగా పొందవచ్చని ప్రభుత్వం సూచించింది. 2020 నవంబరు నుంచి 2021 సెప్టెంబరు 30 వరకు ఈ పథకం కింద రుణాలు పొంది సకాలంలో చెల్లించిన 4.50 లక్షల మంది ఖాతాల్లో రూ.16.36 కోట్ల వడ్డీ మొత్తాన్ని బదిలీ చేశారు.

సుదీర్ఘ పాదయాత్రలో చిరు వ్యాపారుల కష్టాలను కళ్లార చూశానన్నారు. చిరు వ్యాపారులు, తోపుడు బండ్లతో సహా అందరికీ ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందన్నారు. వడ్డీ వ్యాపారుల చెర నుంచి చిరు వ్యాపారులకు ఈ పథకం ద్వారా విముక్తి కలుగుతుందన్నారు. ప్రతి ఒక్కరికీ ఏటా రూ.10వేల వడ్డీలేని రుణం అందిస్తున్నామని.. ఇప్పటివరకు 9.05 లక్షల మందికి రూ.905 కోట్లు పంపిణీ చేశామన్నారు. ఇప్పటివరకు సకాలంలో చెల్లించిన 4.50 లక్షల మందికి రూ.16.36 కోట్ల వడ్డీ జమ చేస్తున్నామన్నారు. ఏడాదిలో రెండుసార్లు డిసెంబర్‌, జూన్‌లో ‘జగనన్న తోడు’ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. రుణాలు చెల్లించిన వారికి కొత్త లోన్లు ఇస్తాం. కొత్త రుణాలతో పాటు కట్టిన వడ్డీని వాపసు ఇస్తామన్నారు.

Post a Comment

0 Comments