రైతు బంధు సొమ్ము జమ చేయడానికి వ్యవసాయ, ఆర్థికశాఖలు ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి. సోమవారం(రేపటి) నుంచి రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బు వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత ఎకరాలోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో.. తర్వాత 2, 3, 4 ఎకరాల్లోపు వారికి సొమ్ము జమ చేస్తారు. ఎకరానికి రూ.5 వేల చొప్పున రైతు ఖాతాలో వేయాలన్నది ఈ పథకం నిబంధన.

తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా ఉండేందుకు రైతు బంధు పథకం ప్రారంభించింది. అన్నదాతలు ఎక్కడబడితే అక్కడ రుణాలు తీసుకొని అప్పులో ఊబిలో పడకుండా ఉండేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. రైతులకు మేలు చేసేందుకు... రైతు బంధు పథకాన్ని అమల్లోకి తెచ్చింది. సాధారణంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో ఈ పథకం ద్వారా రైతులకు నిధులు ఇస్తోంది ప్రభుత్వం. తద్వారా వారికి ఇది పెట్టుబడి సాయంగా మారుతోంది. పథకం నిధులతో రైతులు... విత్తనాలు, పురుగు మందుల వంటివి కొనుక్కునేందుకు వీలవుతోంది. ఈమధ్య కరోనా కారణంగా... రైతు బంధు నిధుల పంపిణీ ఆలస్యమైంది
0 Comments