ఓ వ్యక్తి ఏకంగా సింహం బోనులోకే ప్రవేశించాడు. అతడిని ఎగాదిగా చూసిన సింహం ఏమీ చేయకుండా వదిలిపెట్టింది. దీంతో అధికారులు, పర్యాటకులు ఊపిరి పీల్చుకున్నారు. ఢిల్లీ జూలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఓ వ్యక్తి ఏకంగా అలాంటి సింహం ఎన్క్లోజర్లోకే వెళ్లాడు. కానీ, అతడిని ఆ మృగరాజు ఏమీ చేయకపోవడం గమనార్హం. కొరుక్కుతినేంత పని చేసినట్లు ఎగాదిగా చూసి వదిలేసింది. దీంతో జూ సిబ్బంది, పర్యాటకులు ఊపిరి పీల్చుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని ఓ జూలో ఈ ఘటన చోటు చేసుకుంది.
సింహం ఎన్క్లోజర్లో ప్రవేశించిన వ్యక్తిని రేహాన్ ఖాన్ (28)గా గుర్తించారు. బీహార్కు చెందిన ఈ యువకుడికి మతిస్థితిమం సరిగా లేనట్లు గుర్తించారు. అందువల్లే అతడు సింహం ఎన్క్లోజర్లోకి వెళ్లినట్లు తెలిపారు.

0 Comments