మనాలీ నుంచి లాహోల్స్పిటి లోయ వరకు దీన్ని నిర్మించారు. దీని వల్ల... మనాలీ నుంచి లఢక్ లోని లేహ్ వరకు 7 గంటల రోడ్డు ప్రయాణ సమయం, 45 కిలోమీటర్ల దూరం తగ్గుతాయి. పైగా... ఇది సొరంగం కావడం వల్ల దీన్లోకి మంచు రాదు. అందువల్ల దీన్ని ఎప్పుడూ మూసివేయాల్సిన అవసరం రాదు. అంతేకాదు... లఢక్, అక్సాయ్ చిన్ సరిహద్దుల్లో ఉన్న భారత సైన్యానికి ఆయుధాలు, ఆహారం పంపేందుకు ఇది ఉపయోగపడనుంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రధానితో కలిసి దక్షిణ ఎంట్రీ నుంచి ఉత్తరం వైపు సొరంగ మార్గంలో ప్రయాణిస్తారు. ఆ తర్వాత మోదీ... దక్షిణ ద్వారం వైపు వెళ్లే హిమాచల్ ఆర్టీసీ బస్సును జెండా ఊపి ప్రారంభిస్తారు.
0 Comments