ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఫెమ్ ఇండియా ఏసియాపోస్ట్ మ్యాగజైన్ ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారం అందుకున్న Nizamabad MP Kavita..
నిజామాబాద్ ఎంపీ కవిత ఫ్రేమ్ ఇండియా–ఏషియా పోస్ట్ మ్యాగజైన్ బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డును అందుకున్నారు. గురువారం సాయంత్రం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి గిరిరాజ్సింగ్ ఎంపీకి అవార్డును అందజేశారుప్రజాదరణ, కార్యశీలత, సామాజిక సేవాదృక్పథం, లోక్సభకు హాజరు, లోక్సభ నిర్వహణలో పాత్ర, నియమనిబంధనలు పాటించడం,ప్రశ్నలగడం తదితర అంశాల ఆధారంగా ఎంపీలను ఈ అవార్డుకు ఎంపిక చేశారుఢిల్లీలో గురువారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చేతుల మీదుగా కవితతో పాటు 25 మంది ఎంపీలు అవార్డులు అందుకున్నారు.బతుకమ్మ పండుగకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంలో ఆమె చురుగ్గా వ్యవహరించారని, తెలంగాణ సంస్కృతిక సంప్రదాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలకంగా వ్యవహరించారని వివరించింది. అవార్డు అందుకున్న ఎంపీ కవితకు అభిమానులు అభినందనలు తెలిపారు. అంతకుముందు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నివాసానికి వెళ్లి స్పీకర్ ఆశీస్సులు తీసుకున్నారు.కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎంపీలు జితేందర్రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, కొత్త ప్రభాకర్రెడ్డి, బీబీపాటిల్, సంతోష్కుమార్ పాల్గొన్నారు.

0 Comments